భారత్ లో కొత్తగా 15940 కరోనా కేసులు నమోదు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Saturday, June 25, 2022

demo-image

భారత్ లో కొత్తగా 15940 కరోనా కేసులు నమోదు

poornam%20copy

భారత్ లో కొత్తగా 15940 కరోనా కేసులు నమోదు

WhatsApp%20Image%202022-06-25%20at%2010.14.34%20AM


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 17 వేలకుపైగా కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 15,940కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,33,78,234కు చేరాయి.

ఇందులో 4,27,61,481 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా 5,24,974 మంది మరణించారు. మరో 91,779 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 20 మంది మరణించగా 12,425 మంది డిశ్చార్జీ అయ్యారు.యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువవడంతో యాక్టివిటీ రేటు 0.21 శాతానికి పెరిగింది. రికరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 196.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages