లోక్ అదాలత్ పై అవగాహన కల్పిస్తూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, May 20, 2022

లోక్ అదాలత్ పై అవగాహన కల్పిస్తూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు

 పారా లీగల్ వాలంటరీ లకు లోక్ అదాలత్ పై అవగాహన కల్పిస్తూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు




స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో పారా లీగల్ వాలంటరీ లకు రాబోయే జూన్ 26 జరుగు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై శ్రీనివాసరావు మరియు పారా లీగల్ వాలంటరీ లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.... రాబోయే జూన్ 26 జరుగు జాతీయ లోక్ అదాలత్  విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఎలాంటి కేసులు లోక్ అదాలత్ లో జరుగుతాయి, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన అందించారు. మరియు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే పారాలీగల్ వాలంటరీ లు  న్యాయానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని, ప్రజలకు న్యాయ అవగాహన కల్పించాలని తెలిపారు. మరియు న్యాయ పరమైన సందేహాలు, సలహాల కొరకు 15100 కు ఫోన్ చేస్తే ఉచితము అందిస్తారు అని తెలిపారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad