APSRTC: టికెట్ కొనేందుకు డబ్బులు లేవా.. అయినా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగంటే
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి:
●ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవాలంటే నగదు తప్పనిసరి.
◆మన దగ్గర యూపీఐ పేమెంట్స్(UPI Payments) అనగా ఫోన్-పే,గూగుల్ పే, పేటియం వంటివి చేసే వెసులుబాటు ఉండి, నగదు( జేబులో డబ్బులు) లేకపోతే ప్రయాణించేందుకు కుదరదు.
అంతే కాకుండా బస్సుల్లో నిత్యం చిల్లర సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు ఇవి గొడవలకూ దారితీస్తాయి.
◆ఈ ఇబ్బందులన్నింటినీ తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికుల నుంచి అవసరమైన మొత్తాన్ని ప్రస్తుతం నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారు.
◆ఇకపై డిజిటల్ చెల్లింపులు జరిగే విధంగా ‘యూనిఫైడ్ టికెటింగ్ సిస్టం (UTS)’ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన టెండర్ను అభి బస్ సంస్థ దక్కించుకుంది. యూటీఎస్ కోసం ఆర్టీసీ నిర్వహించిన టెండర్లలో 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. మూడు కంపెనీలు అర్హత సాధించగా.. రివర్స్ టెండరింగ్లో అభి బస్ సంస్థను ఆర్టీసీ ఎంపిక చేసింది.
◆ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు ఇచ్చేందుకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్) ఉపయోగిస్తున్నారు.
◆వీటి స్థానంలో ఈ–పాస్ (UTS) మెషిన్లను ప్రవేశపెడతారు. వాటిద్వారా డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తారు.
◆ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.
◆ ఆన్లైన్ విధానంలో ముందుగా టికెట్ల బుకింగ్లు, బస్పాస్లు, కొరియర్ సేవలు, పార్సిల్ బుకింగ్లకూ అవకాశం కల్పిస్తారు.
◆ బస్ లైవ్ ట్రాకింగ్, ప్రయాణికుల సమాచారం, సెంట్రల్ కమాండ్ స్టేషన్ నిర్వహణ మొదలైనవి అందుబాటులోకి వస్తాయి. దీనిని ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేయనున్నారు.








No comments:
Post a Comment