తిరుమల శ్రీవారికి కర్ణాటక వారు లారీ విరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 24, 2022

తిరుమల శ్రీవారికి కర్ణాటక వారు లారీ విరాళం

 తిరుమల శ్రీవారికి కర్ణాటక వారు లారీ విరాళం 


స్వర్ణముఖి న్యూస్,తిరుమల : 

తిరుమల శ్రీవారికి కూరగాయల రైతులు లారీని విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని ముళబాగల్ మాజీ ఎమ్మెల్యే జి. మంజునాథ్‌తో పాటు మరో 12 మంది కూరగాయల దాతలు రూ. 30 లక్షల విలువైన లారీని తిరుమల,తిరుమపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ మేరకు లారీ తాళంచెవులను ఆయనకు అందజేశారు.టీటీడీ అన్నప్రసాద కార్యకలాపాలకు కూరగాయలను తీసుకెళ్లేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. కార్యక్రమంలో టీటీడీ అన్నప్రసాదం, దాతల విభాగం డిప్యూటీ ఈఓ పద్మావతి, డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad