హత్యాచారానికి గురైన కుటుంబానికి.. లోకేశ్​ ఆర్థికసాయం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 24, 2022

హత్యాచారానికి గురైన కుటుంబానికి.. లోకేశ్​ ఆర్థికసాయం

 హత్యాచారానికి గురైన కుటుంబానికి.. లోకేశ్​ ఆర్థికసాయం


అమరావతి/మంగళగిరి


ఇటీవల తుమ్మపూడి గ్రామంలో హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, శ్రీ నారా లోకేశ్ ఆర్ధిక సాయం అందించారు.


- తిరుపతమ్మ కుమార్తె, కుమారుడు పేరు మీద ఫిక్సిడ్​ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.


★ ఇటీవల మంగళగిరి నియోజకవర్గం తుమ్మపూడి గ్రామంలో హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. 


★ తిరుపతమ్మ కుమార్తె పేరున రూ.3 లక్షలు, కుమారుడు వరుణ్ సాయి పేరు మీద రూ.2 లక్షలు ఫిక్సిడ్​ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. 


★ పిల్లలు ఇద్దరూ బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. 


★ ఎప్పుడూ ఏ సమస్య ఉన్నా అన్నగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.


★ తుమ్మపూడిలో తిరుపతమ్మ మృగాళ్ల చేతిలో హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.. అదే రోజు తిరుపతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించిన లోకేశ్​ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చెయ్యడంతోపాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 


★ ఇచ్చిన మాట ప్రకారం నేడు తిరుపతమ్మ కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు. 


★ ఆయన వెంట దుగ్గిరాల మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad