కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి ..! - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, May 24, 2022

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి ..!

 కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది మృతి ..!

 


కర్ణాటకలోని హుబ్లి శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం కొల్హాపూర్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా 26 మందికి గాయలయ్యాయి.


సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుబ్లిలోని కిమ్స్‌కి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్​ ఇద్దరూ  అక్కడికక్కడే మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad