వాయులింగేశ్వర సేవలో గాలి జనార్దన్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువు తీరివున్న శ్రీకాళహస్తి క్షేత్రమునకు ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ వేత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై కుటుంబ సమేతంగా ఆలయమునకు విచ్చేసి స్వామి-అమ్మవార్ల ప్రత్యేక పూజలలో పాల్గొని దర్శనం చేసుకొన్నారు. దర్శనానంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వారిని దుశ్యాలవతో సత్కరించి, స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
No comments:
Post a Comment