ఎంసెట్ 2024- 25 పరీక్ష ఫలితాలలో ఎంజీఎం జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
నిన్న సాయంత్రం విడుదలైన ఎంసెట్ పరీక్ష ఫలితాలలో శ్రీకాళహస్తి ఎంజీఎం జూనియర్ కళాశాల విద్యార్థిని డి. వాసవి-5414 ఎంసెట్ లో (హాల్ టికెట్ నెంబర్:-( 550786040126) రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించింది.
అలాగే జి.చరిష్మా ఎంసెట్ ర్యాంక్-8703 హాల్ టికెట్ నెంబర్-(951286050022), బిందు వైష్ణవి ఎంసెట్ ర్యాంక్ 11,480 (హాల్ టికెట్ నెంబర్ 550185010056) సాధించారు.
అలాగే M. సుమ శ్రీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి గ్రూపు నందు ఐపీలో ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ లో 435/440 స్టేట్ 3rd ర్యాంక్ సాధించింది.
రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను ఎంజిఎం జూనియర్ కళాశాల డైరెక్టర్ గుడ్లూరు మయూర్ పుష్పగుచ్చం బహుకరించి సన్మానించారు.అదేవిధంగా పై చదువులలో బాగా రాణించాలని ఈ సందర్భంగా ఆశీర్వదించారు.
పై కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ కళాశాల డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ కళాశాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అనేక స్టేట్ ర్యాంకులు శ్రీకాళహస్తికు తీసుకువచ్చామని రాబోవు 2025-26 విద్యా సంవత్సరం నుండి నూతనంగా ఎంజీఎం ఫేస్ ప్రోగ్రాం (పర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్) ప్రారంభిస్తున్నామని ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థిని, విద్యార్థులను అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ చేసి వారికి మంచి ర్యాంకులు సాధించే విధంగా తీర్చి దిద్ద గలుగుతామని ఆశిస్తున్నాము.
అలాగే ఎంజీఎం కళాశాల లెక్చరర్స్ కృషి, పట్టుదల కొత్త విధానాలను ఎప్పటికప్పుడు అలవర్చుకోవడం మరియు స్మార్ట్ బోర్డ్ నియమించుకోవడం స్మార్ట్ పేపర్ కరెక్షన్ అలవర్చుకోవడం ద్వారా ఇలాంటి ఘన విజయాలు సాధించామని తెలియజేశారు.
పై కార్యక్రమంలో ఎంజీఎం కళాశాల ఏవో మహదేవన్ మరియు కళాశాల లెక్చరర్స్,సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment