హక్కులపై అవగహన కల్పించిన న్యాయవాదులు, - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, April 5, 2022

హక్కులపై అవగహన కల్పించిన న్యాయవాదులు,

షెడ్యూల్ తెగలు, మరియు వారి హక్కులపై అవగహన కల్పించిన న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు   
స్వర్ణముఖి న్యూస్, శ్రీకాళహస్తి :
న్యాయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కోర్టు వారి ఆదేశాల మేరకు ఆజాది కా అమ్రిత్ మహోత్సవ లో భాగవుగా డోర్ టు డోర్ క్యాంపు ఏప్రిల్ 4 వ తేదీ అక్కుర్తి ఎస్ టి కాలనీ లో 5 వ తేదీ చుక్కలనిడిగళ్ళు ఎస్ టి కాలనీ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమములో లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబెర్ , పారా లీగల్ వాలంటరీ లు పాల్గొన్నారు,

సమస్యలపై ఊరు ప్రజలను అడిగి తెలుసుకొన్నారు. అక్కుర్తి ఎస్ టి కాలనీ ప్రజలు ఊరులోని గంగమ్మ గుడి వేప చెట్టు సమస్య తెలిపినారు. అలాగే చుక్కలనిడిగళ్ళు ఎస్ టి కాలనీ వాసులు రోడ్ సమస్య, అధిక మొత్తములో ఇసుక తరలింపు ..మొదలైన కొన్ని సమస్యలు అనగా రోడ్,డ్రైనేజీ సమస్య, నీటి సమస్యలు తెలపగ, అనంతరం సమస్యలని గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి ద్వారా సంబంధిత అధికారులకు సమస్యలను తెలుపుతాము అని అన్నారు అందించారు. 

లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబెర్ మాట్లాడుతూ... అక్కుర్తి, చుక్కలనిడిగళ్ళు ఎస్ టి కాలనీ వాసులు సమస్యలు త్రాగునీరు, రోడ్, ఇసుక రవాణా సమస్యలు తెలిపినారు. ఈ సమస్యలని గౌరవ శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి తెలుపుతాము అన్నారు. మరియు షెడ్యూల్ తెగలు, మరియు వారి హక్కులపై అవగహన కల్పించారు. అనంతరం షెడ్యూల్ తెగలు,కులాలకు భూమిలేని వారికీ భూమి కల్పించు అవకాశం అందిస్తాము అన్నారు. అలాగే గిరిజ సంక్షేమ,ప్రభుత్వం పథకాల,చట్టాల గురించి అవగాహన కల్పించారు.అలాగే కోవిడ్ అధికముగా వునందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మీ ఊరి లో ఏ సమస్య వున్నా మాకు తెలపండి అన్నారు. అలాగే న్యాయ సలహాలకు 15100 ఫోన్ నెంబర్ గాని తెలియజేయవలసిందిగా కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad