ఇంట ఇంట స్వాతంత్ర దినోత్సవ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన న్యాయవాదులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, August 10, 2022

ఇంట ఇంట స్వాతంత్ర దినోత్సవ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన న్యాయవాదులు

 ఇంట ఇంట స్వాతంత్ర దినోత్సవ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన న్యాయవాదులు




స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని గాంధీవీధి,కొత్తపేట,నగులాగుంట వీధిలో  ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం భాగంగా  ఇంట ఇంట స్వాతంత్ర దినోత్సవ మరియు దేశభక్తి పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయవాదులు రమేష్ బాబు, ప్రజ్ఞశ్రీ,  మరియు కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతి ఒక ఇంట్లో జాతీయ జండాలు నాటి వాటి విశిష్టత ను వివరించారు

న్యాయవాది మాట్లాడుతూ.... ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం ప్రజలకు వివరించారు . అలాగే 

రాబోయే 75 స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు ఆగస్ట్ 15 వ తేదీన వారి ఇంటి పైన రెపరెపలాడే జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు.అలాగే చిన్నపిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్న 1 5 1 0 0 నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad