జాతీయ లోక్ అదాలత్ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జ్ వై శ్రీనివాసరావు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, August 12, 2022

జాతీయ లోక్ అదాలత్ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జ్ వై శ్రీనివాసరావు

 జాతీయ లోక్ అదాలత్ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జ్ వై శ్రీనివాసరావు


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని సీనియర్ సివిల్ కోర్ట్ ఆవరణలో నందు  ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం భాగంగా ఎన్ జి ఓ లు మరియు పార లీగల్  వాలంటరీ లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం గురించి వివరించారు. మరియు రేపు జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసరావు, యువతరం సేవా సమితి సభ్యులు , కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు పాల్గొన్నారు.

ప్రతి ఒక ఇంట్లో జాతీయ జండాలు నాటి వాటి విశిష్టత ను వివరించారు

న్యాయమూర్తి మాట్లాడుతూ.... ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం ప్రజలకు వివరించారు . అనంతరం ఎన్ జి ఓ చట్టాలపై అవగాహన కల్పించారు. అలాగే 

రాబోయే 75 స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు ఆగస్ట్ 15 వ తేదీన వారి ఇంటి పైన రెపరెపలాడే జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు.అలాగే చిన్నపిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్న 1 5 1 0 0 నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad