ప్రతి విద్యార్థికి దేశ భక్తితో మెలవాలని తెలిపిన లాయర్ రాజేశ్వరరావు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, August 6, 2022

ప్రతి విద్యార్థికి దేశ భక్తితో మెలవాలని తెలిపిన లాయర్ రాజేశ్వరరావు

 ప్రతి విద్యార్థికి దేశ భక్తితో మెలవాలని  తెలిపిన లాయర్ రాజేశ్వరరావు





స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్ పి పి ఎస్ జెడ్పి బాయ్స్ హై స్కూల్ నందు ఆజాద్ అమృత్  మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయవాదులు రాజేశ్వరరావు, ప్రజ్ఞ శ్రీ,  మునిశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మరియు కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

న్యాయవాదులు మాట్లాడుతూ.... రాబోయే 75 స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు ఆగస్ట్ 15 వ తేదీన వారి ఇంటి పైన రెపరెపలాడే జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని ఈ సందర్భంగా నెమరవేసుకొనారు. అలాగే చిన్నపిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్న 1 5 1 0 0 నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad