మహిళల సంరక్షణ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన న్యాయవాదులు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, August 11, 2022

మహిళల సంరక్షణ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన న్యాయవాదులు

 మహిళల సంరక్షణ మరియు దేశభక్తి పై అవగాహన కల్పించిన న్యాయవాదులు



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని వంశీ జూనియర్ కాలేజ్ నందు  ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం భాగంగా మహిళా సంరక్షణ మరియు మహిళల చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయవాదులు రాజేశ్వరరావు, రమేష్ బాబు,  కాలేజ్ కరస్పాండెంట్ రవిప్రసాద్, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ శర్మ మరియు కాలేజీ సిబ్బంది, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతి ఒక ఇంట్లో జాతీయ జండాలు నాటి వాటి విశిష్టత ను వివరించారు

న్యాయవాది మాట్లాడుతూ.... ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం ప్రజలకు వివరించారు . అనంతరం మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. మన సంరక్షణ మనమే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే 

రాబోయే 75 స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు ఆగస్ట్ 15 వ తేదీన వారి ఇంటి పైన రెపరెపలాడే జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు.అలాగే చిన్నపిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్న 1 5 1 0 0 నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad