దేశభక్తి పై అవగాహన కల్పించుటకు వ్యాసరచన పోటీలు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, August 8, 2022

దేశభక్తి పై అవగాహన కల్పించుటకు వ్యాసరచన పోటీలు

దేశభక్తి పై అవగాహన కల్పించుటకు వ్యాసరచన పోటీలు


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :



తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని విశ్వ భారతి స్కూల్ లో ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం భాగంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీ కార్యక్రమం జరిగింది. ఈ వ్యాస రచన పోటీలో రాబోయే 75వ స్వాతంత్ర దినోత్సవ ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం గురించి రాయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యాయవాదులు అరుణ్, పాఠశాల కరస్పాండ ెంట్ శ్రీధర్ మరియు కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటరీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పై వ్యాసరచన పోటీలు ఉత్తీర్ణలైన  విజేతలకు ఆగస్టు 15వ తేదీ బహుమతి ప్రధానం చేస్తామని తెలిపారు

న్యాయవాది మాట్లాడుతూ.... ఆజాద్ అమృత్  మహోత్సవంలో హర్ ఘర్ తిరంగ్ మహోత్సవం గురించి తెలుసుకోవాలని. అన్నారు.
మన దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. కావున
రాబోయే 75 స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క పౌరుడు ఆగస్ట్ 15 వ తేదీన వారి ఇంటి పైన రెపరెపలాడే జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని ఈ సందర్భంగా నెమరవేసుకొనారు. అలాగే చిన్నపిల్లలకు, మహిళలకు ఉచిత న్యాయం అందిస్తారని అన్నారు. మీకు ఏ సమస్య ఉన్న 1 5 1 0 0 నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు తెలుసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad