రాజీమార్గమే రాజ మార్గం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, March 5, 2022

రాజీమార్గమే రాజ మార్గం

 రాజీమార్గమే రాజ మార్గం, రాబోయే మార్చ్12 జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి కె అరుణ


సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  ఆదేశాల మేరకు  మార్చ్ 12 న జరుగు జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని కోరిన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్  జడ్జి  శ్రీమతి అరుణ పత్రిక విలేకరుల సమావేశం లో తెలిపారు.

సీనియర్ సివిల్ జడ్జి అరుణ మాట్లాడుతూ.... జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు.ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని  తెలిపారు. 

ముఖ్యముగా అన్ని రకాల క్రిమినల్ మరియు సివిల్ కేసులు మరియు క్రిమినల్ కాంపౌండ్ కేసులు,

ఎన్ ఐ యాక్ట్ కేసుల్లో  సుమారు 2రెండు లక్షల విలువగల చెక్కు ఎన్ ఐ యాక్ట్ కేసు u/s 138,

బ్యాంక్ రికవరీ కేసు, Mact  కేసు, మ్యాట్రిమోనీ కేసు o/s 125 crps, లేబర్ డిస్ప్యూట్స్,

 ల్యాండ్ ఆక్విసిషన్ కేసు, other సివిల్ కేసు, రెవెన్యూ కేసు,  కాంపౌండ్ ఎక్సైజ్ కేసు,

 ఫ్రీ లిటిగేషన్ కేసు లు.... మొదలైన కేసులు పరిష్కరించుటకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగించు కోవాలని కోరారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad