సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, March 24, 2022

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

 దేశ రక్షణకై జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి కార్మిక సంఘాల పిలుపు,, 




స్వర్ణముఖి న్యూస్ ,శ్రీకాళహస్తి

మార్చి 28 29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ శ్రీకాళహస్తి సి ఐ టి యు ఆఫీసులో కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సి ఐ టి యు ఏ ఐ టి యు సి ఐ ఎఫ్ టి యు ముఖ్య నాయకులు పాల్గొని ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ప్రజలు దేశ రక్షణకై జరిగే సమ్మెను ప్రతి ఒక్కరూ పాల్గొని కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు కి వ్యతిరేకంగా జరిగే సమ్మెను కార్మికులు ఉద్యోగులు రైతన్నలు కళాకారులు మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు  కనీస వేతనం 26,000 అమలు చేయాలని ప్రైవేట్ కరణ విధానాలని నిలుపుదల చేయాలని లేబర్ చట్టాలను అమలు చేయాలనే రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని అనేక సమస్యలపై జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ పుల్లయ్య సి ఐ టి యు డివిజన్ కార్యదర్శి గురవయ్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  దాసరి జనార్ధన్ ఐ ఎఫ్ టి యు జిల్లా  కార్యదర్శి కె  రమేష్ బ్యాంకింగ్ రంగం కార్యదర్శి స్వామి మార్కెట్ అమాలి కార్యదర్శి ఇ కృష్ణ సిఐటియు శ్రీకాళహస్తి టౌన్ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు ఏ ఐ టి సి డివిజన్ కార్యదర్శి వై యస్ మనీ మోహన్ రెడ్డి ఇ చాముండేశ్వరి కార్తీక్ కార్మికులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad