ముక్కంటి సేవలో తిరుపతి మేయర్ డా. శిరీష కుటుంబ సమేతంగా - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, October 5, 2022

ముక్కంటి సేవలో తిరుపతి మేయర్ డా. శిరీష కుటుంబ సమేతంగా

ముక్కంటి సేవలో  తిరుపతి మేయర్ డా. శిరీష కుటుంబ సమేతంగా

 

 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువు తీరివున్న శ్రీకాళహస్తి క్షేత్రమునకు తిరుపతి మేయర్ *డా. శిరీష కుటుంబ సమేతంగా ఆలయమునకు విచ్చేశారు. వారికి  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి స్వామి-అమ్మవార్ల ప్రత్యేక పూజలతో దర్శనం చేయించారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు నవ కలిశాల పవిత్ర జలాల అభషేక పూజలలో పాల్గొన్నారు. తదనంతరం ఆలయంలోని దక్షిణామూర్తి స్వామి వారి సన్నిధానం వద్ద వేదంపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి, శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి-అమ్మ వార్ల వస్త్రాలను, చిత్రపటాన్ని  మరియు తీర్థ ప్రసాదాలను వారికి ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad