పోలియో రహిత భారతాన్ని నిర్మిద్దాం!! - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, February 25, 2022

పోలియో రహిత భారతాన్ని నిర్మిద్దాం!!

పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిద్దాం!  పోలియో రహిత భారతాన్ని నిర్మిద్దాం!!





శ్రీకాళహస్తి పురపాలక సంఘమ నందు పల్స్ పోలియో కార్యక్రమము   తేదీ:  27.02.2022  నుండి 01.03.2022 వరకు నిర్వహించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చిన ఆదేశముల మేరకు, శ్రీకాళహస్తి పట్టణములో 0-5   సంవత్సరములు  లోపు  పిల్లల సంఖ్య   9,525  ఉన్నందున,  పట్టణములో  మొత్తము 51 పోలియో  కేంద్రములు  (అన్ని ప్రభుత్వ పాఠశాలల యందు )  ఏర్పాటు  చేయటము  జరిగినది.  అలాగే   ట్రాన్సిట్  కేంద్రములు  రైల్వే స్టేషన్ ,  బస్సు స్టేషన్ మరియు  దేవస్థానము   నందు  ఏర్పాటు  చేయడము  జరిగినది. మొబైల్ టీములు 2 ఏర్పాటు చేయడము జరిగినది.  

                కావున  శ్రీకాళహస్తి  పట్టణ   ప్రజలు అందరూ  సహకరించి  0-5  సంవత్సరముల లోపు  పిల్లలకు   తప్పనిసరిగా మీకు దగ్గరలోని పల్స్ పోలియో కేంద్రములలో పోలియో చుక్కలు వేయించి ఈ పోలియో వ్యాధిని కలిగించే వైరస్ ను సమూలంగా నిర్మూలించవలసినదిగా తెలియజేయడమైనది.

కమీషనర్,    శ్రీకాళహస్తి పురపాలక సంఘము


No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad