విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, February 23, 2022

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

 విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరిన డాక్టర్ ప్రమీలమ్మ 



 చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం లోని పెద్ద కన్నలి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదివే సుమారు 80 విద్యార్థులకు రాబోయే పరీక్షలు బాగా రాయాలని కోరుతూ వారికి పరీక్షలకు సంబంధించి పరీక్ష సామగ్రి (పాడ్ , పెన్, పెన్సిల్, ఎర్రిసెర్, మెండేర్,స్కేల్,జామెండ్రి బాక్స్..మొదలైనవి)  ఉచితంగా అందించారు. 


డాక్టర్ ప్రమీలమ్మ మాట్లాడుతూ.... మా మామ గారు అయినటువంటి కన్నలి చిన్న రామ్ రెడ్డి గారి కట్టించిన ఆ స్కూల్ నందు ఆయన జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరము 10 క్లాస్ విద్యార్థులకు ఉచితముగా పరీక్ష  సామాగ్రి అందించడం ఆనవాయితీ, దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా సుమారు 80 మంది విద్యార్థులకు పరీక్షలకు పరీక్ష సామాగ్రి లు అందించడం జరిగింది. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ శ్రీకాళహస్తీశ్వరుని కోరుచున్నాను అని తెలిపారు


ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ మరియు పాఠశాల అధ్యాపకులు, స్టెప్స్ సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad