శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి తనయురాలు మరియు అపోలో హాస్పిటల్ సీఈఓ. - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, November 30, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి తనయురాలు మరియు అపోలో హాస్పిటల్ సీఈఓ.

 శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత  శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి తనయురాలు మరియు అపోలో హాస్పిటల్  సీఈఓ.


   స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన  తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత  శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తనయురాలు కృపా లక్ష్మి, మరియు అపోలో హాస్పిటల్ సీఈఓ లతా రెడ్డిగారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం దర్శనానికి విచ్చేసిన్నారు.

 వారికి  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు  అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి    శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయిలిగేశ్వర స్వామి వారిని ప్రత్యేక దర్శించుకున్నారు.అనంతరం శ్రీ దక్షిణ మూర్తి సన్నిధానం వద్ద వేదపండితులచే ఆశీర్వదించి, శేష వస్త్రంతో సత్కరించి  స్వామి అమ్మ వార్లచిత్రపటాన్ని మరియు తీర్థప్రసాదాలను  అందచేశారు. ఈ కార్యక్రమంలో  దేవస్థాన అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి, ఆలయ అర్చకులు ఆలయ అధికారులు మరియు వైఎ్సార్సీపీకి నాయకులు సత్రవాడ కుమార్, రామకృష్ణ, గణేష్, పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad