శ్రీకాళహస్తిలో కనకాచలం కొండపై బయల్పడిన ఏనుగు ఆకారం శిల
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి
కాళహస్తిలోని కనకాచలం కొండ వద్ద ఏనుగు ఆకారంలో ఉన్న కొండశిల వెలుగులోకి వచ్చింది. దీనిపై పండితులు మణిశర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో శ్రీకాళహస్తీశ్వరుని పాము, ఏనుగు, సాలెడు పూజిస్తు శివయ్యలో ఐక్యం అయ్యాయనిది స్థల పురాణం చరిత్ర. ఈ క్షేత్రంలో అనేక తీర్థాలు ఉన్నాయన్నారు. అందులో స్వామివారికి కనకాచలం ఉత్తర ప్రాంతం నుండి నీటిని సేకరించి స్వామివారికి అభిషేకం చేసేదన్నారు. ఆ ప్రాంతాన్ని హాస్తి తీర్థం అంటారని ఆ ప్రాంతంలో ఏనుగు ఆకారంలో ప్రతిబింబిస్తు శిల బయల్పడడం జరిగిందన్నారు. నాటి చరిత్రలకు సాక్షాలైన ఇటువంటి శిలలను రాబోయే తరానికి తెలిసే విధంగా అభివృద్ధి పరిచి క్షేత్ర మహత్యాన్ని మరింత వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
No comments:
Post a Comment